Andhra PradeshTelangana

తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌లోనూ రోజురోజుకూ పెరుగుతున్న కరోనా వ్యాప్తి

Kalinga Times, Hyderabad :

ఆంధ్రప్రదేశ్‌లో…  శుక్రవారం రాత్రికి కోవిడ్-19 కేసులు 164కు చేరుకున్నాయి. గురువారం రాత్రి 10 గంటల నుంచి శుక్రవారం రాత్రి 10 గంటల వరకు 15 కేసులు నమోదయ్యాయి. మొత్తం 164 కేసులలో 108 ఢిల్లీ నుంచి వచ్చినవారే. మరో 32 మంది వారికి సన్నిహితంగా మెలిగినవారు.
ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం బులెటిన్‌ విడుదల చేసింది. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 32 కేసులు నమోదయ్యాయి. తర్వాత 23 కేసులతో కృష్ణా, 20 కేసులతో గుంటూరు ఉన్నాయి.

తెలంగాణలో…   రోజురోజుకూ కేసుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. వారం రోజుల కిందట వరకు రాష్ట్రంలో కేసులు 59 ఉండగా.. శుక్రవారం ఒక్కరోజే 70 మందిలో వైరస్‌ సోకినట్లుగా నిర్ధారణ అయ్యింది. దీంతో పాజిటివ్‌ కేసులు సంఖ్య 229కి చేరుకుంది. మహమ్మారికి శుక్రవారం మరో ఇద్దరు బలయ్యారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన మహిళ ఒకరు కాగా, మరొకరు సికింద్రాబాద్‌ వ్యక్తిగా వైద్య ఆరోగ్యశాఖ ప్రకటనలో తెలిపింది. దీంతో ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 11కు పెరిగింది. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 86 మృతిచెందారు. అత్యధికంగా మహారాష్ట్రలో 26 మంది, తెలంగాణ 11, మధ్యప్రదేశ్ 8, గుజరాత్ 9, ఢిల్లీ 6, పశ్చిమ్ బెంగాల్ 6, పంజాబ్ 5, ఢిల్లీ 4, కర్ణాటక 4, జమ్మూ అండ్ కశ్మీర్ 2, ఉత్తర ప్రదేశ్ 2, కేరళలో 2, హిమాచల్ ప్రదేశ్‌ 2, ఏపీ, బీహార్, తమిళనాడు,లో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 229 మంది బాధితులు కోలుకున్నారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Close