Telangana

గుట్కా,పొగాకు ప్యాకెట్స్ అమ్ముతున్న దుకాణదారులపై మెరుపు దాడులు

నిషేధిత పదార్థాలను విక్రయిస్తే కఠిన చర్యలు-సీఐ రమేష్ బాబు, జి డి కె 1 టౌన్

కళింగ టైమ్స్ ,గోదావరిఖని :
గోదావరిఖని 1టౌన్ ఇన్స్పెక్టర్  గంగాధర రమేష్ బాబు  ఆధ్వర్యంలో నిషేధిత గుట్కా, పొగాకు విక్రయదారుల పై సిబ్బంది మెరుపుదాడి చేసి అక్రమంగా గుట్కా, పొగాకు ప్యాకెట్స్ ని విక్రయిస్తున్న పలువురి విక్రయదారులపై కేసులు నమోదు చేశారు. సీఐ రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం గోదావరిఖని పట్టణంలో కొంతమంది దుకాణదారులు నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులు అమ్ముతున్నారనే  సమాచారం మేరకు సంబంధిత దుకాణాలపై సిబ్బంది తో మెరుపు దాడులు చేయడం జరిగింది. వారి వద్ద నుండి 70,500/- రూపాయల విలువచేసే గుట్కా ప్యాకెట్స్,పొగాకు ప్యాకెట్స్ స్వాధీనం చేసుకొని వారిమీద కేసు నమోదు చేశామన్నారు.కేసు నమోదు చేసిన వారి వివరాలు,రవి రాజు ,అడ్డగుంటపల్లి.యండి అబ్బాస్  రాంనగర్.సర్దార్ అబ్దుల్ రజాక్, జవహర్ నగర్,.కొమ్ము నరేందర్, విఠల్ నగర్,అక్రమంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో ఎవరైనా నిషేధిత వస్తువులను,మత్తు పదార్థాలను అమ్మితే వారి పైన కఠినచర్యలు తీసుకుంటామని వారిమీద కేసులు నమోదుచేసి జైలు కి పంపిస్తామని హెచ్చరించారు. ఈ దాడులలో సీఐ లు రమేష్ బాబు,రాజ్ కుమార్ గౌడ్, కానిస్టేబుల్స్ ఏలీయా, శేఖర్ సదయ్య,హోంగార్డ్స్ తిరుపతి,మర్రి శ్రీనివాస్, రాజశేఖర్ లు పాల్గొన్నారు.

Show More

Related Articles

4 Comments

Leave a Reply

Your email address will not be published.

Close