social

గోరింటాకు గింజలతో సాంబ్రాణి ధూపం వేస్తే మహాలక్ష్మీ అనుగ్రహం

Kalinga Times, Hyderabad : గోరింటాకు మొక్క  లక్ష్మీదేవి అంశమని , ఏ ఇంట గోరింటాకు మొక్క వుంటుందో ఆ ఇంట్లో దుష్ట శక్తులు వుండవు. కారణం గోరింటాకు మొక్కకు వున్న వాసన. ఈ వాసన కొన్ని రకాల పురుగులను చంపేస్తుంది. గోరింటాకు మొక్కను ఇంట్లో వుంచడం ద్వారా క్షుద్ర శక్తులు కూడా నశిస్తాయని పండితుల వాక్కు. గోరింటాకు మొక్కను ఇంట్లో నాటి శుక్రవారం పూట సాంబ్రాణితో ధూపం వేయడం ద్వారా.. ఆ వాసనకు కంటికి తెలియని క్రిములు తొలగిపోతాయి. దుష్ట శక్తులు తొలగిపోతాయి. ముఖ్యంగా గోరింటాకు గింజలతో సాంబ్రాణి ధూపం వేస్తే.. ఆ ఇంట మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా వాస్తు దోషాలను గోరింటాకు మొక్క తొలగిస్తుంది. ముఖ్యంగా అద్దె ఇళ్ళల్లో వుండేవారు ఇంటి ముందు తులసి మొక్క, గోరింటాకు మొక్కను నాటడం ద్వారా వాస్తు దోషాలు తొలగిపోతాయి. పూల తొట్టెలోనైనా గోరింటాకు మొక్కను పెంచడం మంచి ఫలితాలను ఇస్తుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

Tags
Show More

Related Articles

Leave a Reply to pCimXONMdADXPMO Cancel reply

Your email address will not be published.

Close