social

నానావతి ఆస్పత్రిలో ఐశ్వర్యారాయ్‌

Kalinga Times, Mubai : అమితాబ్ బచ్చన్‌కు కరోనా వైరస్ సోకడంతో కుటుంబసభ్యులకు పరీక్షలు నిర్వహించగా అభిషేక్, ఐశ్వర్యతో పాటు ఆరాధ్యకు పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. ఐశ్వర్యకు తొలిసారి చేసిన పరీక్షలో నెగటివ్‌గా తేలగా.. జులై 12న రెండోసారి నిర్వహించిన పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కుమార్తె ఆరాధ్యకు కూడా పాజిటివ్‌గా తేలింది. నాటి నుంచి తల్లీకూతుళ్లు గృహ నిర్భందంలో ఉన్నారు.
46 ఏళ్ల ఐశ్వర్యారాయ్‌కి కొవిడ్ పాజిటివ్‌గా తేలినప్పటికీ ఎలాంటి లక్షణాలు బయటపడలేదు. అయితే.. శుక్రవారం స్వల్ప లక్షణాలు కనిపించడంతో ఆస్పత్రిలో అడ్మిట్ అయినట్లు నానావతి ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించాయి. ఐశ్వర్యారాయ్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలియగానే అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుతూ ట్వీట్లు చేస్తున్నారు.

Tags
Show More

Related Articles

Leave a Reply to nSIJgUvXCnPW Cancel reply

Your email address will not be published.

Close